నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. చిన్న, పెద్ద పారిశ్రామిక వేత్తలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అంచనాలు, ఆకాంక్షలను నెరవేస్తుందన్నారు. రాబోయే 25 ఏళ్లలో దేశాభివృద్ధికి ఈ బడ్జెట్ బ్లూ ఫ్రింట్ అన్నారు. ఈ బడ్జెట్ గరీబ్ కళ్యాణ్ బడ్జెట్ అని...పేదలు, కార్మికుల సాధికారతను అందిస్తుందన్నారు. గ్రామీణ, కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ ను అంకితం చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు జేపీ నడ్డా.
This Budget fulfills the expectation and aspirations of all sections of society including small & big industrialists. This is not an agenda of merely one year's development, but a blueprint of the country's development in the next 25 years: BJP chief JP Nadda pic.twitter.com/ncLJmwlFG5
— ANI (@ANI) February 1, 2022
మరిన్ని వార్తల కోసం