
శ్రీశైలం, వెలుగు: శని, ఆదివారాలు సెలవులు రావడంతో.. శ్రీశైలానికి యాత్రికులు క్యూ కట్టారు. దీనికితోడు నాలుగు రోజులుగా ఇక్కడి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు వేలాదిగా తరలిస్తున్నారు. హైదరాబాద్ వైపు నుంచి భారీగా వాహనాలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు నిదానంగా కదులుతుండడంతో బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు తిప్పలు పడ్డారు. శ్రీశైలం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.