- స్టేషన్ బెయిల్ కోసం రూ.25 వేలు అడిగిన ఆసిఫాబాద్ఎస్ఐ రాజ్యలక్ష్మి
- చార్జిమెమో ఎత్తేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసిన హుజూరాబాద్ డీఎం శ్రీకాంత్
- ఫార్మసీ సర్టిఫికెట్ కోసం రూ.18 వేలు ఇవ్వాలన్న నల్గొండ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్
- అందరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు
ఏసీబీ దూకుడు పెంచింది. ఒకే రోజు ముగ్గురు అవినీతి అధికారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. యాక్సిడెంట్ కేసులో ఓ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 25 వేలు డిమాండ్ చేసిన ఆసిఫాబాద్ పీఎస్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, డ్యూటీకి రాని డ్రైవర్కు చార్జిమెమో ఇచ్చి.. ఎత్తేసేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటున్న హుజూరాబాద్ ఆర్టీసీ డీఎం శ్రీకాంత్, జనాలకు ఫ్రీగా వైద్యం అందించడంలో భాగంగా మెడికల్ షాపు కావాలని అడిగితే..లైసెన్స్ కోసం రూ.18 వేలు లంచం అడిగిన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఇందులో ఉన్నారు.
ఆసిఫాబాద్: రోడ్డు యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం, వాహనాన్ని వదిలిపెట్టేందుకు ఓ మహిళా ఎస్ఐ రూ. 25 వేల లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో రాజ్యలక్ష్మి ఎస్ఐ. గత నెల 31న ఆసిఫాబాద్ మండలం బురుగూడ వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసులో మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన యాహియా ఖాన్ నిందితుడు. ఈయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, వాహనం రిలీజ్ చేసేందుకు ఎస్ఐ రాజ్యలక్ష్మి రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం పోలీస్స్టేషన్లో నిందితుడు రూ. 25 వేలను ఎస్ఐ రాజ్యలక్ష్మికి ఇస్తుండగా అదిలాబాద్ రేంజ్ ఏసీబీ ఇన్ చార్జ్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి చెప్పారు.
లీవ్ ఇవ్వకుండా చార్జిమెమో ఇచ్చి ఎత్తేసేందుకు 30 వేలు అడిగిన డీఎం..
ఎల్కతుర్తి: హుజూరాబాద్ఆర్టీసీ డిపో మేనేజర్శ్రీకాంత్సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అదే డిపోలో పని చేస్తున్న ఓ డ్రైవర్ అనివార్య కారణాలతో డ్యూటీకి రాకపోవడంతో చార్జి మెమో ఇష్యూ చేశాడు. దానిని ఎత్తేసేందుకు రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. సోమవారం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన తాటికొండ రవీందర్ హుజూరాబాద్ఆర్టీసీ డిపోలో డ్రైవర్. ఫిబ్రవరి13న రవీందర్సమీప బంధువు కొడుకు హనుమకొండలో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రవీందర్ లీవ్ కోసం అప్లై చేశాడు.
కానీ, డీఎం లీవ్ఇవ్వలేదు. దీంతో రవీందర్డ్యూటీకి వెళ్లలేదు. డీఎం శ్రీకాంత్మూడు రోజులు ఆబ్సెంట్వేశాడు. రవీందర్కు చార్జి మెమో ఇష్యూ చేశాడు. తర్వాత దానిని తొలగించాలని రవీందర్కోరగా, రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తనకు అంత ఆర్థిక స్తోమత లేదని, రూ. 10 వేలు మాత్రమే ఉన్నాయని రవీందర్ ముట్టజెప్పాడు. అయినప్పటికీ డీఎం వినకపోవడం, మిగతా రూ. 20 వేలు ఇవ్వాలని పట్టుబట్టడంతో రవీందర్ఏసీబీని ఆశ్రయించాడు. ఎల్కతుర్తిలోని మన్విత హోటల్లో సోమవారం మధ్యాహ్నం రవీందర్ నుంచి డీఎం శ్రీకాంత్ రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫార్మసీ లైసెన్స్ కోసం..
నల్గొండ అర్బన్ : ఫార్మసీ లైసెన్స్కోసం దరఖాస్తు చేసుకున్న ట్రస్టు నుంచి లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ఇన్స్పెక్టర్సోమశేఖర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు, బాధితుల కథనం ప్రకారం..మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తగూడెంలో నూకల వెంకట్రెడ్డి..చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనుకున్నారు. ట్రస్టు దవాఖానకు అనుమతి తీసుకున్న తర్వాత మెడికల్ షాప్ కోసం అప్లై చేసుకున్నారు.
అయితే, డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, ఉన్నతాధికారులు కూడా చెక్ చేస్తారని ట్రస్టు నిర్వాహకుడి దగ్గర మేనేజర్గా పని చేస్తున్న చిట్టెపు సైదిరెడ్డిని రూ. 18 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సైదిరెడ్డి..వెంకట్రెడ్డికి చెప్పడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనలతో నల్గొండలోని ఆఫీసులో డ్రగ్ఇన్స్పెక్టర్ సోమశేఖర్కు రూ.18వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోమశేఖర్ను కస్టడిలోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ నరేందర్, సీఐలు వెంకట్రావు, రామారావు పాల్గొన్నారు.