కరెంట్ తీగ తగిలిస్తుండగా షాక్ ..ముగ్గురికి తీవ్ర గాయాలు

కరెంట్ తీగ తగిలిస్తుండగా షాక్ ..ముగ్గురికి తీవ్ర గాయాలు
  • రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఘటన

జ్యోతినగర్​, వెలుగు :  ఇంట్లోకి కరెంట్​సరఫరా కోసం యత్నిస్తుండగా ముగ్గురు గాయపడ్డారు. రామగుండం కార్పొరేషన్​పరిధి ఎన్టీపీసీ క్రషర్ నగర్ కు చెందిన ఓ మహిళ తన ఇంట్లో కరెంట్​సరఫరా కాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఇక్కింట్లో ఉండే గణేశ్(18 )​, శివకేశవ(16), నరేశ్(13)ను పిలిచింది.  వారు వచ్చి కర్రతో పైనున్న విద్యుత్ వైరు తగిలిస్తుండగా 33 కేవీ తీగలపై పడి.. ఒకదానికొకటి రాసుకుని తెగి మీద పడ్డాయి. దీంతో షాక్ కొట్టి ముగ్గురికి ముఖం, చేతులు కాలిపోయాయి. వెంటనే108లో  గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన ట్రీట్​మెంట్ ​కోసం కరీంనగర్​కు పంపారు. ఘటనపై పోలీస్, ట్రాన్స్​కో అధికారులు ఆరా తీస్తున్నారు.