చైనా స్మార్ట్ఫోన్ మేకర్ లెనొవొ.. ఇండియా మార్కెట్కు గురువారం మూడు స్మార్ట్ఫోన్లు.. జెడ్6 ప్రొ, ఏ6 నోట్, కే10 నోట్లను తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఉండే జెడ్6ప్రొ ధర రూ.33,999. కే10 నోట్ ధర రూ.13,999 నుంచి మొదలవుతుంది. ఇందులో 4జీబీ, 6జీబీ వెర్షన్లు ఉంటాయి. బడ్జెట్ ఫోన్ ఏ6 నోట్ ధర రూ.7,999. ఇందులో 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ఉంటుంది. ఈ మూడు ఫోన్లూ ఈ నెల 11 నుంచి ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి వస్తాయి.

