టైగర్.. నా డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ : అభిషేక్ అగర్వాల్

టైగర్.. నా డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ : అభిషేక్ అగర్వాల్

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ తర్వాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ సినిమా విశేషాల గురించి ఇలా మాట్లాడారు. 

‘కంటెంట్ బేస్డ్, అన్ టోల్డ్ స్టొరీస్ చెప్పాలనేది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌‌ లక్ష్యం. ఈ సినిమా కూడా అలాంటి పవర్ ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా. నాగేశ్వరరావు దొంగ ఎందుకయ్యాడు.. ఆ తర్వాత ఏం చేశాడు లాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఏమాత్రం రాజీ పడకుండా ఈ కథకు ఏం కావాలో అది వందశాతం ఇచ్చాం. రవితేజ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌‌లన్నీ ఆయనే చేశారు. తన చేతికి గాయమైనప్పటికీ ఎంతో సపోర్ట్ చేస్తూ షూటింగ్‌‌కి ఇబ్బంది లేకుండా చేశారు.

ఈ జర్నీ చాలా మెమరబుల్. ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్‌‌. అందుకే మొదటి నుండి ప్రమోషన్‌‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఫస్ట్ లుక్ రాజమండ్రిలో, ట్రైలర్‌‌‌‌ను నార్త్‌‌లో గ్రాండ్‌‌గా లాంచ్ చేశాం. దీంతో తెలుగుతో పాటు నార్త్‌‌లోనూ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కంటెంట్‌‌పై చాలా నమ్మకంగా వున్నాం. అలాగే ప్రేక్షకులపై నమ్మకం వుంది. తప్పకుండా సినిమాని గొప్పగా ఆదరిస్తారు. నా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ఇది నిలిచిపోతుంది. వచ్చిన మూడేళ్ళలోనే నిర్మాతగా జాతీయ అవార్డు  (‘ది కాశ్మీర్‌‌‌‌ ఫైల్స్‌‌’ చిత్రానికి) అందుకోవడం మా సంస్థకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. ఇక త్వరలోనే మరో బయోపిక్ అనౌన్స్ చేస్తున్నాం. అది కూడా చాలా సర్‌‌ప్రైజింగ్‌‌గా ఉంటుంది.