రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పటికే ఒక సాంగ్ను రిలీజ్ చేశారు. తాజాగా రెండో పాటకు టైమ్ ఫిక్స్ చేశారు.
‘గల్లంతే’ అంటూ సాగే పాటను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజ, కావ్యథాపర్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.