న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కోల్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని అసనసోల్ ప్రాంతంల్లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ గనులకు సంబంధించిన స్కామ్ లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2020 నవంబర్ లో ఎఫ్ ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది సీబీఐ. లోకల్ కోల్ ఆపరేటర్ అనూప్ మాజీ అలియాస్ లాలా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో నిందితుడు అశోక్ మిశ్రా అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడని పేర్కొంది ఈడీ. అభిషేక్ బంధువులకు నిధులు బదిలీ చేశారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరపనుంది.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు
పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్
వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు