నేడు హైఓల్టేజ్ మ్యాచ్.. ఢిల్లీతో బెంగళూరు ఢీ

నేడు హైఓల్టేజ్ మ్యాచ్.. ఢిల్లీతో బెంగళూరు ఢీ
  • సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిదో..?

అహ్మదాబాద్:  ఐపీఎల్ –14లో బలాబలాల పరంగా సమంగా ఉన్న రెండు పెద్ద జట్ల మధ్య పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగే మ్యాచ్​లో రాయల్ చాలెంజర్స్​ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్​ తలపడనున్నాయి. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన గత మ్యాచ్​లో సూపర్​ ఓవర్​లో గెలిచిన ఢిల్లీ ఫుల్ కాన్ఫిడెన్స్​తో ఈ మ్యాచ్​బరిలోకి దిగుతోంది. మరోపక్క చెన్నై సూపర్​కింగ్స్​ చేతిలో చిత్తుగా ఓడి...తొలి ఓటమి రుచి చూసిన బెంగళూరు తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టింది. ఏదేమైనా సమ ఉజ్జీల్లా కనిపిస్తున్నా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదు. అయితే, ఈ మ్యాచ్​కు ముందు బెంగళూరు తమ మిడిలార్డర్​లో డొల్లతనాన్ని సరి చేసుకోవాలి. చెన్నై మ్యాచ్​లో ఆర్​సీబీ మిడిలార్డర్​ పెవిలియన్​కు క్యూకట్టింది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు కెప్టెన్​ కోహ్లీ, పడిక్కల్​కు మిడిలార్డర్​ నుంచి సపోర్ట్​ దొరక్కపోతే గెలవడం కష్టమే. మ్యాక్స్​వెల్​, డివిలియర్స్​​ తమ వంద శాతం ఇస్తేనే ఢిల్లీపై ఆర్​సీబీ పైచేయి సాధిస్తుంది. ఇక, బౌలింగ్​లో కోహ్లీసేనకు పెద్దగా సమస్యల్లేవు. లాస్ట్​ మ్యాచ్​లో ఒకే ఓవర్​లో జడేజాకు 37 రన్స్​ ఇచ్చుకున్న హర్షల్​ ​ పుంజుకుంటాడో లేదో చూడాలి.  ఇక, ఢిల్లీకి ఎలాంటి సమస్యల్లేవు. ఓపెనర్లు ధవన్​, పృథ్వీ సూపర్​ ఫామ్​లో ఉండగా స్మిత్​, కెప్టెన్​ పంత్​ వీరికి అండగా నిలుస్తున్నారు. స్టోయినిస్, హెట్​మయర్​తో మిడిలార్డర్​ కూడా బలంగా ఉంది. బౌలింగ్​ విషయానికొస్తే స్పిన్నర్​ అశ్విన్​ సీజన్​నుంచి తప్పుకోవడంతో అమిత్​ మిశ్రా, అక్షర్​ పటేల్​ స్పిన్​ బాధ్యతలు పంచుకోనున్నారు. పేసర్లు​ అవేశ్, రబాడ సత్తా చాటుతున్నారు.  దీంతో ఈ మ్యాచ్​లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం.