దేశంలో ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఇంజనీర్లు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం ఆనందదాయకం. నిజాయితీ, పట్టుదల, అంకితభావం ఉండే ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది. నేడు ‘ఇంజనీర్స్ డే’. ఇంజనీరింగ్ రంగంలో ఎన్నో సేవలందించి, సమాజంలో విశిష్ట స్థానాన్ని పొందిన వారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖలు. ఈ ఒక్క రంగంలోనే కాకుండా విద్య, పారిశ్రామిక, సామాజిక తదితర రంగాల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పిన మేధావి ఆయన. విశ్వేశ్వరయ్య ప్రస్తుత ఇంజనీర్లకు, విద్యార్థులకు ఆదర్శప్రాయులు. ఆయన15 సెప్టెంబర్1861లో కర్నాటకలోని ముద్దనహల్లి గ్రామంలో పుట్టారు. సొంత ఊరిలో ప్రాథమిక విద్యను, హయ్యర్ స్టడీస్ బెంగళూరులో పూర్తి చేశారు. 1883లో పూనా సైన్స్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. ఈ రంగంలో వివిధ హోదాల్లో పని చేశారు. అప్పుడే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూట్టారు. కర్నాటకలో కృష్ణసాగర్ డ్యాం, దేశంలో విలువైన ఆస్తిగా పిలుస్తున్న భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ, మైసూర్సాండల్ సోప్ ఫ్యాక్టరీ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యత కారణంగా దేశంలో అనేక పథకాలను విశ్వేశ్వరయ్య రూపొందించారు. నీటి వృథాను అరికట్టడానికి ‘బ్లాక్ సిస్టమ్’ అనే సరికొత్త పద్ధతిని రూపొందించారు. హైదరాబాద్లోని మూసీ నది వరదలను అరికట్టేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల రూపకల్పన కూడా విశ్వేశ్వరయ్య చేపట్టిందే. బంధు ప్రీతి లేకుండా నిష్పక్షపాతంగా ఉండటం ఆయన ప్రత్యేకత. ప్రభుత్వ వాహనాలను సొంతంగా ఉపయోగించే వారు కాదు. తన బాధ్యతలను కేవలం ప్రజా సేవ కోసం మాత్రమే వెచ్చించే వారు. రిటైర్మెంట్ తర్వాత ఎన్నో దేశాలు పర్యటించి అక్కడి నిర్మాణ వ్యవస్థను పరిశీలించి1920లో ‘భారత పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికా బద్ధమైన ఆర్థిక విధానం’ అనే పుస్తకాలు రాశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1955లో ఆయనను భారత ప్రభుత్వం ‘భారత రత్న’ బిరుదుతో సత్కరించింది. ఆయన పేరు మీదుగానే ఏటా ‘ఇంజనీర్స్ డే’ నిర్వహిస్తున్నారు. - పి.మోహన్ చారి
ప్రమాణాల ఇంజనీర్ విశ్వేశ్వరయ్య
- వెలుగు ఓపెన్ పేజ్
- September 15, 2021
లేటెస్ట్
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
- ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే