ఆస్పత్రి పాలైన సునైన...ఇంతకీ ఆమెకు ఏమైంది?

ఆస్పత్రి పాలైన సునైన...ఇంతకీ ఆమెకు ఏమైంది?

రాజ రాజ చోర సినిమాతో హీరోయిన్ గా తనకంటూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన.  తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ఓ పోస్టు ఆమె అభిమానులకు ఆందోళనకు గురిచేస్తుంది.   చేతికి సెలైన్‌ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై దిగిన ఫొటోను  సునైన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే ఏ కారణంగా సునైన ఆస్పత్రి పాలైందో  వెల్లడించలేదు.  కానీ త్వరలోనే దృఢంగా తిరిగి వస్తానని చెప్పుకొచ్చింది.   ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు సునైన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

2005లో కుమార్ వెర్సస్ కుమారి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సునైన.  తెలుగు, తమిళ, కన్నడ, మళయాళి  బాషల్లో హీరోయిన్ గా నటించింది.