నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం నుంచి ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఏ టూరిస్ట్ ప్లేస్ సేఫ్? వంటివి తెలుసుకోవడం... ఇలా ప్రతిదీ యాప్స్ సాయంతో ఈజీ అయింది ఇప్పుడు. అంతేకాదు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసే ముందు అక్కడి వాతావరణం, ఫెసిలిటీస్ తెలుసుకునేందుకు టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారట చాలామంది. టూర్ ప్లాన్ కోసం దాదాపు75 శాతానికి పైగా ఇండియన్ టూరిస్ట్లు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారట. సేఫ్ అయిన దేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటోంది ‘బుకింగ్.కామ్’ అనే ట్రావెల్ సంస్థ.
ఈ ఏడాది చేయాలనుకునే ట్రిప్స్కోసం ట్రావెలర్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయంపై ‘ట్రావెల్ ప్రిడిక్షన్స్ 2022 రీసెర్చ్’ రిపోర్టు రిలీజ్ చేసింది ఈ సంస్థ. ఈ రిపోర్టులోని ఇంట్రెస్టింగ్ విషయాలివి... టికెట్స్ బుక్ చేయడం నుంచి ట్రిప్ ప్లాన్స్ సెలక్ట్ చేసుకోవడం వరకు అన్నింటికి టెక్నాలజీ వాడుతున్నారు టూరిస్టులు. కొత్త ప్లేస్లకి వెళ్లే ముందు ఉండే యాగ్జైంటీని ట్రావెల్ సైట్స్, యాప్లు తగ్గిస్తున్నాయని చెప్తున్నారు 76 శాతం మంది భారతీయులు. ట్రావెలింగ్లో వస్తోన్న కొత్త టెక్నాలజీలని 72 శాతం మంది ఓ కంట గమనిస్తున్నారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్ సర్వీస్లు ట్రావెలర్స్కి చాలా హెల్ప్ చేస్తున్నాయి. వీటి ద్వారా చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజెస్ గురించి బస చేయాలనుకున్న హోటల్, పికప్ చేసుకోవడానికి కార్లని పంపించే సంస్థకి మెసేజ్ వెళ్తుంది. ఫ్లయిట్ ఆలస్యం కావడం వల్ల బీచ్ కాటేజ్కి లేట్గా వస్తున్నామని చెప్పేయొచ్చు కూడా. ఏ దేశంలో టూరింగ్ చాలా సేఫ్? అనేది కొన్ని నెలల ముందుగానే చెప్పే టెక్నాలజీ కోసం టూరిస్టులు చూస్తున్నారు. అంతేకాదు ఆయా దేశాల్లో కరోనా సిచ్యుయేషన్ బట్టి ఏ ప్లేస్లకి తొందరగా వెళ్లొచ్చు? అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు.
అంతా టెక్నాలజీతో...
‘‘కరోనా వల్ల గత రెండేండ్లలో ట్రావెలింగ్లో చాలా మార్పులు వచ్చాయి. ట్రావెలర్స్ ఆలోచనలో కూడా ఛేంజ్ వచ్చింది. టెక్నాలజీ సాయంతో ట్రావెలింగ్కు సరైన టైమ్ తెలుసుకుంటున్నారు. టూర్ ప్లాన్ చేసుకునే ముందు చాలామంది టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. ట్రావెలర్స్కి ఏ విధమైన సాయం చేయడానికైనా మేం
రెడీగా ఉన్నాం” అంటున్నారు ‘బుకింగ్.కామ్’ సౌత్ ఏషియా రీజినల్ మేనేజర్ రితూ మెహ్రొత్రా.