
నకిరేకల్, వెలుగు : బీసీ బాంధవుడు సీఎం రేవంత్ అని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో సీఎం రేవంత్రెడ్డిని సోమవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ సంఘాల నాయకులతోపాటు ఆయన కలిశారు.
ఈ సందర్భంగా సీఎంను సన్మానించారు. ఈ సందర్భంగా కిరణ్యాదవ్మాట్లాడుతూ బీసీ కులగణనను 100 శాతం డిజిటలైజేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.