నాగర్ కర్నూ ల్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్తో రైతు మృతి

నాగర్ కర్నూ ల్ జిల్లాలో విషాదం.. విద్యుత్  షాక్తో రైతు మృతి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూ ల్​జిల్లా​తాడూరు మండలం అల్లాపూర్  గ్రామానికి చెందిన భరత్(30) కరెంట్​షాక్​తో చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నా యి. భరత్  గురువారం తన పొలం వద్దకు వెళ్లి కింద పడిపోయిన బోర్​ కరెంట్ ​వైర్లను సరి చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్  షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.