ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జాయింట్ కలెక్టర్ గా బి.రాజకుమారి, ఏఎంఆర్డీయే అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఏఎంఆర్డీఏ కమిషనర్ గా కె.విజయ, సీసీఎల్ ఏ అప్పీల్స్ కమిషనర్ గా డాక్టర్ పి.లక్ష్మినరసింహం, ఎనర్జీ డిపార్టుమెంట్ డిప్యూటీ సెక్రెటరీగా పృథ్వీతేజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పృథ్వీతేజ్ కు ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.