అక్కడి మార్కెట్ లో ట్రాన్స్ జెండర్లపై నిషేధం

అక్కడి మార్కెట్ లో ట్రాన్స్ జెండర్లపై నిషేధం

సూరత్ : ఇటీవల గుజరాత్ లోని సూరత్ లో ట్రాన్స్ జెండర్లు ఓ వ్యక్తిని కర్రతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో స్థానికంగా కలకలం రేపింది. డబ్బుల పేరుతో ప్రజలను వేధిస్తూ.. ఇవ్వకుంటే నానా రచ్చ చేస్తుండటంతో అక్కడి అధికారులు విసుగుచెంది ఓ నిర్ణయానికి వచ్చారు.

సూరత్ మార్కెట్ లో ట్రాన్స్ జెండర్లపై నిషేధం విధించారు. ఇటీవల ఓ వ్యక్తిని ట్రాన్స్ జెండర్లు కర్రతో కొట్టి చంపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అక్కడి అధికారులు. డబ్బుల కోసం ట్రాన్స్ జెండర్లు అందరినీ వేధిస్తున్నారని.. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే ట్రాన్స్ జెండర్ల నిషేధం తప్పదని చెప్పారు సూరత్ మార్కెట్ లోని వ్యాపారులు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి ట్రాన్స్ జెండర్లు ప్రవేశించకూడదని నోటీసులు అంటిచామని తెలిపారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు పోలీసులు.