ఆర్మూర్​లో పర్యటించిన త్రిపుర గవర్నర్

ఆర్మూర్​లో పర్యటించిన త్రిపుర గవర్నర్
  • సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్​ లో సోమవారం త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా​ రెడ్డి పర్యటించారు. టౌన్​ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టను సందర్శించారు. శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్దులగుట్ట చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గుట్ట అభివృద్దికి తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం బీజేపీ సీనియర్​ నాయకులు లోక భూపతిరెడ్డి నివాసానికి వెళ్ళి  మాట్లాడారు. 

 అనంతరం అంకాపూర్​ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులతో  మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి, బీజేపీ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్​ కులచారి, నాయకులు అల్జాపూర్​ శ్రీనివాస్​, పెద్దోళ్ళ గంగారెడ్డి, కంచెట్టిగంగాధర్​, నూతుల శ్రీనివాస్ రెడ్డి, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు. 

బస్వాపూర్​లో టీ బ్రేక్ 

భిక్కనూరు : హైదరాబాద్ నుంచి బాసర వెళ్తున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కామారెడ్డి జిల్లా సరిహద్దు మండలం  బస్వాపూర్​ గ్రామ శివారులోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. హోటల్​ యజమాని ఒంటరి రవీందర్​రెడ్డి రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి తేనేటి విందును అందజేశారు.  గవర్నర్​ వెంట ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, నాయకులు ఉన్నారు.