
ఆర్థిక లాభం కోసం ఇతర మరణాలను కరోనా డెత్స్ గా చూపిస్తున్నరు: ట్రంప్
వాటర్ ఫోర్డ్ (మిషిగన్): కరోనా వ్యాప్తిని తమకు అనుకూలంగా మలచుకుని, ఆర్థికంగా లాభం పొందేందుకు అమెరికన్ డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. అమెరికన్ డాక్టర్లు సొంత లాభం కోసమే కరోనా మరణాలను పెంచి చూపిస్తున్నారని మండిపడ్డారు. గుండె జబ్బులు, క్యాన్సర్ రోగాలతో చనిపోయే స్థితిలో ఉన్న పేషెంట్లకు చివరి రోజుల్లో కరోనా సోకితే.. ఆ మరణాలను కూడా కరోనా డెత్స్ గా చెప్తున్నారని, కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చన్నదే వాళ్ల దురాశ అని ట్రంప్ విమర్శించారు. జర్మనీ, తదితర దేశాల్లో హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి రోగాలతో చనిపోతున్న పేషెంట్లకు కరోనా ఉన్నా.. వాటిని కరోనా డెత్స్ గా చూపడంలేదన్నారు. ఇండియాలో కన్నా.. అమెరికాలోనే కరోనా టెస్టులు ఎక్కువగా చేశామని చెప్పారు. చాలా దేశాలు అసలు టెస్టులే చేయడం లేదన్నారు.
మళ్లీ ఆంక్షలు తప్పవు..
కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాలో మళ్లీ మామూలు రోజులు వస్తాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా ప్రత్యర్థి జో బిడెన్ మాత్రం మున్ముందు ఇంకా గడ్డు రోజులు చూస్తామంటూ కామెంట్ చేశారు. విస్కాన్సిన్, మిషిగన్లో ట్రంప్, మినెసోటా, అయోవాలో బిడెన్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 4న అమెరికాలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8.6 కోట్ల మంది ముందస్తు ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నామని, మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్లు, ట్రీట్మెంట్లు అతి తొందర్లోనే రాబోతున్నాయని అన్నారు. ‘‘మన దేశానికి ఇప్పుడు కావాల్సింది సుదీర్ఘమైన చీకటి వింటర్. దాని గురించి మాట్లాడే లీడర్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు దేశవ్యాప్తంగా ఆంక్షలు పెట్టడం తప్పనిసరి’’ అని ట్రంప్
అన్నారు.
లాక్డౌన్ పెట్టను: బిడెన్
కరోనాను కంట్రోల్ చేయలేమన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాటలను బిడెన్ తోసిపుచ్చారు. తాను అధికారంలోకి వస్తే కరోనాను తప్పకుండా కట్టడి చేస్తానని హామీ ఇచ్చారు. మాస్కులు తప్పనిసరి చేస్తానని, అదే రూల్ అనుసరించేలా అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఆదేశిస్తానని చెప్పారు. దేశ ఎకానమీకి నష్టం కలిగించేలా లాక్డౌన్ విధించబోనని ఆయన ట్విట్టర్లోనూ పేర్కొన్నారు. మిషిగన్లో బిడెన్కు మద్దతుగా బరాక్ ఒబామా ప్రచారం
చేయనున్నారు.