మోడీ ‘ఫాదర్​ ఆఫ్​ ఇండియా’: ట్రంప్

మోడీ ‘ఫాదర్​ ఆఫ్​ ఇండియా’: ట్రంప్

‘‘ఇండియా ఇంతకుముందులా లేదిప్పుడు. గొప్ప స్పిరిట్​తో మోడీ ఒక తండ్రిలా ప్రజల్ని ఏకం చేశారు. వాళ్ల మద్దతుతో రెండోసారి కూడా ఆయన ఘనవిజయం సాధించారు. అందుకే మోడీని ‘ఫాదర్​ ఆఫ్​ ఇండియా’గా భావిస్తాను. పర్సనల్​గా మా ఇద్దరి మధ్య గొప్ప కెమిస్ట్రీ ఉంది. పాప్​ కింగ్​ ఎల్వీస్ ప్రెస్లీ మాదిరిగా మోడీ కూడా రాక్​స్టార్​లా అనిపిస్తారు”అంటూ ప్రధానిపై అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​  ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. యునైటెడ్​ నేషన్స్​ జనరల్​ అసెంబ్లీ సమావేశాల కోసం న్యూయార్క్​లో ఉన్న ఇద్దరు నేతలు మంగళవారం ద్వైపాక్షిక చర్చలు చేశారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ట్రంప్​ ఈ కామెంట్లు చేశారు. రెండు దేశాల ఎకానమీకి బూస్ట్​ ఇచ్చేలా ట్రేడ్​పై త్వరలోనే మంచి డీల్​ కుదుర్చుకుంటామని వెల్లడించారు.

పాక్​కు మోడీ వార్నింగ్​ చాలదా!

మోడీతో భేటీ తర్వాత ట్రంప్​ ఇండియన్​ మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్​ టెర్రరిజంపై ఇండియాతో కలిసి పోరాడుతామన్న అమెరికా.. పాకిస్తాన్​ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని, అల్​కాయిదాకు ట్రైనింగ్​ ఇచ్చింది మేమేనని పాక్​ పీఎం ఇమ్రాన్​ స్వయంగా ఒప్పుకున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని రిపోర్టర్లు ట్రంప్​ను నిలదీశారు. దీనికి సమాధానంగా ట్రంప్​.. ‘‘పాక్​ సంగతి మోడీ చూసుకుంటారు. ఇప్పటికే ఆయనిచ్చిన వార్నింగ్ సరిపోతుందేమో. టెర్రరిజాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ ప్రధానికి బాగా తెలుసు. అమెరికాకు పాక్​ కంటే ఇరానే పెద్ద శత్రువు’’అని స్పష్టం చేశారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు మీడియేషన్​పై మాట్లాడుతూ పాక్ కోరినందుకే కాశ్మీర్​ విషయంలో మీడియేషన్​కు రెడీ అయ్యానని, ఒకవేళ ఇండియా కూడా ఒప్పుకుంటేనే ముందడుగు వేస్తానని అన్నారు. ట్రంప్ కామెంట్లపై విదేశాంగ శాఖ స్పందిస్తూ, కాశ్మీర్​పై థర్డ్​ పార్టీ జోక్యాన్ని సహించబోమని క్లారిటీ ఇచ్చింది.

ట్రంప్​ మన బెస్ట్​ ఫ్రెండ్​: మోడీ

పర్సనల్​గానే కాకుండా ఇండియాకు కూడా ట్రంప్ బెస్ట్​ ఫ్రెండ్​లా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. రెండో సారి గెలిచిన తర్వాత నాలుగు నెలల్లోనే అమెరికా ప్రెసిడెంట్​తో మూడు సార్లు భేటీ అయి చాలా విషయాలపై చర్చలు జరిపానని గుర్తుచేశారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు ఇలా తరచూ ఎంగేజ్​ కావడం, అన్ని రంగాలపై మాట్లాడుకోవడం ప్రపంచానికి మంచి సంకేతమని మోడీ అన్నారు. దోస్తీ ఈ మధ్య మరింత బలపడిందని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగంలో అమెరికా పెట్టుబడుల వల్ల ఇండియాలో కొత్తగా 50వేల కొత్త ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు.

నేషనలిజమే ముద్దు

గ్లోబలైజేషన్​కు కాలం చెల్లిందని, ప్రపంచ దేశాలు వేటికవే జాతీయవాద స్ఫూర్తితో ముందుకెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్​ డోనాల్డ్​ ట్రంప్​ పిలుపునిచ్చారు. మంగళవారం యునైటెడ్​ నేషన్స్ 74వ జనరల్​ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. వరల్డ్​ ఆర్గనైజేషన్లు, కూటములుగా ఏర్పడేకంటే ఎవరికివారు వన్​–టు–వన్​ ఒప్పందాలు చేసుకోవడం మేలన్నారు. సౌదీ అరేబియాలోని ఆయిల్​ రిఫైనరీపై దాడిచేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, ఆ దేశాన్ని కట్టడిచేసేందుకు మిగతా దేశాలు సహకరించాలని కోరారు. ‘‘ఫ్యూచర్​ దేశభక్తులదేకానీ గ్లోబలిస్టులది కాదు. ఏ దేశానికైనా సావర్నిటీ, బోర్డర్​ సెక్యూరిటీ చాలా ముఖ్యం. వలసల వల్ల అవిరెండూ ప్రమాదంలో పడతాయి. వరల్డ్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​(డబ్ల్యూటీవో)లో చైనా చేరిన తర్వాత(2001 తర్వాత) అమెరికాలో 60వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి. డబ్ల్యూటీవో రూల్స్​ని వెంటనే మార్చేయాలి.  సోషలిజం ఓ పీడకల. పాలక వర్గాలకు తప్ప ప్రజలకు మేలు జరగదు.  వెనెజులాకు పట్టిన దుర్గతి అందుకో ఉదాహరణ’’ అని ట్రంప్​ చెప్పారు.