
పేరు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర
ఆలయానికి 67.7 ఎకరాల భూమి
లోక్ సభలో ప్రకటించిన ప్రధాని మోడీ
యూపీ సున్నీ వక్ఫ్బోర్డుకు ఐదెకరాలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనే.. ప్రతిపక్షాల ఆరోపణ
సుప్రీం ఆదేశాలనే అమలు చేశారన్న ఈసీ
రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకం. తీర్పును ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది. ప్రజాస్వామ్యంపై వారు పెట్టుకున్న నమ్మకానికి నా సెల్యూట్. ఇదే నమ్మకాన్ని, సపోర్ట్ను టెంపుల్ నిర్మాణంపైనా చూపించాలి.
– ప్రధాని మోడీ
న్యూఢిల్లీ/ లక్నో / ఇండోర్: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టును ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లోక్సభలో ప్రకటించారు. టెంపుల్ డెవలప్మెంట్కోసం ఓ స్కీంను కూడా తయారుచేసినట్లు చెప్పారు. కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని, కీలకమైన నిర్ణయం కావడంతో సభలో వెల్లడిస్తున్నట్లు ప్రధాని వివరించారు. ట్రస్టుకు 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. యూపీ సన్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడానికి యోగి సర్కారు అంగీకరించిందని మోడీ చెప్పారు. ట్రస్టు ఏర్పాటుకున్న ప్రాధాన్యాన్ని తెలిపేందుకు మోడీ ఈ ప్రకటనను రెండుసార్లు రిపీట్ చేస్తూ సమ్మతి తెలపాలంటూ సభ్యులను కోరారు. రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పును ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుందని, ప్రజాస్వామ్యంపై వారు పెట్టుకున్న నమ్మకానికి తాను సెల్యూట్చేస్తున్నానని అన్నారు. అదే నమ్మకాన్ని, సపోర్ట్ను టెంపుల్ నిర్మాణంపైనా చూపించాలని ప్రధాని కోరారు. దీనిపై సభ్యులు బల్లలు చరుస్తూ, జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 9న రామజన్మభూమి వివాదంపై తీర్పును ప్రకటిస్తూ.. గుడి కట్టేందుకు 3 నెలల్లోగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గడువు ఈ నెల 9తో ముగుస్తుంది.
ట్రస్ట్లో 15 మంది సభ్యులు: అమిత్ షా
రాముడి గుడి కట్టేందుకు ట్రస్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో ప్రకటించిన గంట తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ప్రధాని నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ట్రస్ట్ ఏర్పాటు విధివిధానాలను వెల్లడిస్తూ.. ఒక దళిత సభ్యుడితో సహా 15 మంది ట్రస్టీలతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని షా చెప్పారు. ట్రస్ట్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుందని, ఆలయ నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను ట్రస్ట్ మెంబర్సే తీసుకుంటారని స్పష్టంచేశారు.
మోడల్ మార్చదనుకుంటున్నం: వీహెచ్ పీ
రాముడి గుడి కట్టేందుకు ట్రస్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, గుడి కోసం ఇప్పటికే తాము తయారుచేసిన మోడల్ను ట్రస్ట్ మార్చదని నమ్ముతున్నట్లు విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. ఈమేరకు బుధవారం వీహెచ్పీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్విష్ణు సదాశివ కోక్జే మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్రం ట్రస్ట్ ను ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమి న్యాస్తో కలిసి రామమందిరం మోడల్ను వీహెచ్పీ తయారుచేసిందని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా శిల్పులు స్తంభాలను చెక్కారని తెలిపారు. వేలాది మంది సాధుసన్యాసులు, లక్షలాది హిందువుల మనోభావాలు టెంపుల్ మోడల్తో ముడిపడి ఉన్నాయని కోక్జే అన్నారు.
ఆ ఐదెకరాలిస్తే మేమే గుడి కడ్తం
సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తమకిస్తే అందులో రామమందిరాన్ని తామే కడతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. ‘‘ఆ ల్యాండ్ షియా వక్ఫ్ బోర్డుకు ఇస్తే.. మరో రామ మందిరాన్ని అక్కడ కడతాం”అని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వసీం రిజ్వి చెప్పారు.
వక్ఫ్ బోర్డుకు ల్యాండ్ ఎక్కడిచ్చారు?
లక్నో హైవేలో అయోధ్య జిల్లా సోహావాల్ తహశిల్ పరిధిలోని ధాన్నిపుర్ గ్రామంలో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ల్యాండ్ కేటాయించారు.