టిక్ టాక్ గతే ట్విట్టర్ కు పడ్తది

టిక్ టాక్ గతే ట్విట్టర్ కు పడ్తది

టిక్‌టాక్‌కు ఏర్పడిన పరిస్థితే ట్విట్టర్ కు వస్తుందని హెచ్చరిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ… టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ చేసిన ట్వీ‌ట్‌కు రిప్లై ఇస్తూ కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. క్రికెటర్లు కుక్కల్లా వ్యవహరిస్తున్నారని, రైతు ఉద్యమానికి మద్దతు తెలిపేవారందరూ తీవ్రవాదులేనని కంగన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్విట్టర్ నిర్వాహకులు ఆ ట్వీట్‌ను తొలగించింది. ట్విట్టర్ ఇండియా వ్యవహార శైలిపై కంగన ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా పప్పీ ట్విట్టర్ సంస్థ  తన అకౌంట్‌ను సస్పెండ్ చేస్తానని బెదిరిస్తోందని… చైనాకు చెందిన టిక్‌టాక్ లాగానే ట్విట్టర్ కూడా  ఏదో ఒక రోజు బ్యాన్ అవుతుందని కంగన ట్వీట్ చేసింది.