రెండు బైకులు ఢీ.. చిన్నారి సహా ముగ్గురి మృతి

 రెండు బైకులు ఢీ.. చిన్నారి సహా ముగ్గురి మృతి

కడప: స్పీడ్ గా వెళ్తూ బైకును అదుపుచేయలేక మరో బైకును ఢీకొట్టిన ప్రమాదంలో చిన్నారి సహా మొత్తం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని మందరం గ్రామం వద్ద శనివారం జరిగిన ఘటన స్థానికంగా విషాదం రేపింది. 
రాజంపేట మండలం మందరం గ్రామం వద్ద ఒక బైకు అదుపుతప్పి వేగంగా వెళ్లి మరో బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు బైకులపై ఉన్న మొత్తం ఆరుగురు గాయపడగా.. ముగ్గురికి తీవ్ర రక్తస్రావంతో కూడిన గాయాలయ్యాయి. గాయపడిన వారు హాహాకారాలు చేయగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆరుగురిలో ముగ్గురు చనిపోయారు. మృతులు మారే హరి(30), ఆవుల చిన్నబ్బి(50), హారిక(3)గా గుర్తించారు. ప్రమాదంపై రాజంపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.