
భోపాల్: కర్నాటకలో కుమార సర్కారు కూలిపోయింది, పగ్గాలు చేపట్టడమే ఆలస్యమని సంతోషంగా ఉన్న బీజేపీకి మధ్యప్రదేశ్లో షాక్తగిలింది. ఆ పార్టీ నేతలిద్దరు కాంగ్రెస్సర్కారుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఆందోళనలో పడింది. మధ్యప్రదేశ్అసెంబ్లీలో సర్కారు బుధవారం ప్రవేశపెట్టిన ఓ కీలక బిల్లుకు బీజేపీ లీడర్లు ఇద్దరు అనుకూలంగా ఓటేశారు. రాష్ట్రంలోని లాయర్లు డిమాండ్చేస్తున్న ‘అడ్వొకేట్ప్రొటక్షన్యాక్ట్బిల్’ను బుధవారం కమల్నాథ్సర్కారు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. నిజానికి బిల్లును పదిహేనేళ్ల క్రితమే రూపొందించినా.. అప్పటి బీజేపీ సర్కారు పట్టించుకోలేదు. 3 టర్మ్లు రాష్ట్రాన్ని పాలించినా బిల్లుకు మోక్షం లభించలేదు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ఈ బిల్లును కదిలించింది. బుధవారం ప్రవేశపెట్టింది. దీనికి కాంగ్రెస్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు శరద్కోల్, నారాయణ్త్రిపాఠీ ఓటేశారు. అంతకుముందు బీజేపీ సీనియర్లీడర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గోపాల్భార్గవ మాట్లాడుతూ.. మా బాస్(పార్టీ హైకమాండ్) ఊ అన్నాడంటే మీరు 24 గంటలు కూడా అధికారంలో ఉండరంటూ కమల్నాథ్ను ఉద్దేశించి కామెంట్చేశారు. దీనికి జవాబుగా ‘మీ బాస్కాస్త సెన్సిబుల్కాబట్టే అలాంటి ఆదేశాలివ్వడంలేదు. కానీ మీరలా కాదు కదా, అవిశ్వాస తీర్మానం పెడతానంటే మిమ్మల్ని అడ్డుకునే వాళ్లెవరూ లేరిక్కడ’ అని సీఎం కమల్నాథ్ అన్నారు.