రైలు ఢీకొని రెండు ఏనుగులు మృతి

రైలు ఢీకొని రెండు ఏనుగులు మృతి

ఉత్తరాఖండ్ : రైలు ఢీకొని రెండు ఏనుగులు మృతిచెందిన ఘటన శుక్రవారం ఉత్తరాఖండ్ లో జరిగింది. హరిద్వార దగ్గర ఏనుగులు  రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు రైల్వే పోలీసులు.   రైలు ఢీకొన్న ఘ‌ట‌న‌లో రెండు ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందాయి. ఆ ఏనుగుల‌ను నందాదేవి ఎక్స్‌ ప్రెస్ రైలు ఢీకొన్న‌ట్లు పోలీసులు తెలిపారు.