పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు పుల్వామా జిల్లా పాంపోర్‌లోని లాల్‌పొర ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు పోలీసుల రాకను గమనించి కాల్పులకు తెగబడ్డారు. భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడిక్కడే హతమయ్యారు. అందులోని ఓ ఉగ్రవాది జవాన్లకు లొంగిపోయాడు.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన ఉగ్రవాది స్థానికుడని తెలిపారు. వారి వద్ద నుంచి తుపాకులు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.