ఈవీ కంపెనీలతో ఉబర్​ జోడీ

ఈవీ కంపెనీలతో ఉబర్​ జోడీ

న్యూఢిల్లీ: రైడ్- హెయిలింగ్ యాప్ ఉబర్​ బుధవారం భారతదేశంలోని పలు ఎలక్ట్రిక్ వెహికల్ ​కంపెనీలతో  ప్రకటించింది.  వచ్చే  రెండేళ్లలో భారతదేశంలో 25 వేల ఎలక్ట్రిక్ కార్లను తన ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో చేర్చేందుకు ఈవీ ఫ్లీట్ పార్ట్​నర్లు అయిన లిథియం అర్బన్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ ఫ్లీట్ ప్రైవేట్ లిమిటెడ్,  మూవ్‌‌‌‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  2024 నాటికి ఢిల్లీలో 10 వేల ఈవీ టూవీలర్లను అందుబాటులో తేవడానికి  జిప్​ ఎలక్ట్రిక్‌‌‌‌తో జతకట్టినట్లు ఉబర్ తెలిపింది.

రూ.వెయ్యి కోట్ల విలువైన ఈవీ లోన్లను ఇప్పించడానికి సిడ్బీతో ఒప్పందం చేసుకుంది.  ఉబర్ ఈవీలను వేగంగా ఛార్జింగ్ చేయడానికి జీఎంఆర్​ గ్రీన్ ఎనర్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ఏడాది జూన్ నుండి ఢిల్లీ, ముంబై,  బెంగళూరులలో ఉబర్​ గ్రీన్‌‌‌‌ వెహికల్స్​ను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఉబర్ గ్రీన్​ 15 దేశాల్లోని 100కు పైగా నగరాల్లో ఉంది. 2040 నాటికి తమ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లోని ప్రతి వెహికల్​ఈవీనే ఉండేలా చూస్తామని ఉబర్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మొబిలిటీ  బిజినెస్ ఆపరేషన్స్ ఆండ్రూ మెక్​డొనాల్డ్ చెప్పారు.