నాగర్కర్నూల్, వెలుగు : రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. 9 శాతానికి చేరిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడేవారికి, దొంగలకు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే డబుల్ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించిన ఆయన ఉదయం కొల్లాపూర్లో మామిడి రైతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి కష్టాలడిగి తెలుసుకున్న ఆయన కేంద్రం నుంచి వీలైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని రైతులు మంత్రిని అభ్యర్థించారు. ఉదయం సోమశిల ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి రూ.1100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి ప్రదేశాన్ని విజిట్ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన లోక్సభ ప్రవాస్ యోజనలో పాల్గొన్న ఆయన నాలుగు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జీలతో మాట్లాడారు. వరుసగా కేంద్ర పథకాలను ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మాట తప్పిన సీఎం కేసీఆర్..పీఎం ఆవాస్ యోజన కింద నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు నీడ దొరకకుండా చేశారన్నారు. ఆయుష్మాన్భారత్ అమలు కాకుండా అడ్డుకుని ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో 20 వేల డాక్టర్, స్పెషలిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో పేదలకు వైద్యం అందక, కార్పొరేట్లో చేయించుకునే స్థోమత లేక నలిగిపోతున్నారన్నారు. రైల్వే లైన్ల నిర్మాణంలో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు.
కేంద్రం 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్న ఆయన.. కేసీఆర్ప్రకటించిన 96 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ మాయమైందన్నారు. భూములు అందుబాటులో ఉంటే పరిశ్రమల స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ ( మినిస్ట్రీ ఆఫ్మైక్రో, స్మాల్అండ్మీడియం ఎంటర్ ప్రైజెస్)సెక్టార్ నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా సాయమందిస్తామన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన వర్తక సమావేశంలో మాట్లాడుతూ వ్యాపార,వాణిజ్యం,పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం పూర్తి తోడ్పాటునిస్తుందన్నారు. ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఖండించారు.
మేము దాడులు చేస్తే ఒక్కడూ మిగలడు
జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ టి.ఆచారి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడాన్నీ ఖండిస్తున్నామన్నారు. దీన్నిబట్టి హైదరాబాద్ పోలీసులు,స్టేట్ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అర్థమవుతుందన్నారు. తాము తిరిగి దాడులు చేస్తే ఒక్కడు మిగలడన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, కొల్లా మాధవి, మైనార్టీ మోర్చా స్టేట్ప్రెసిడెంట్అఫ్సర్పాషా,అధికార ప్రతినిధి కట్టా సుధాకర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల అధ్యక్షులు ఎల్లేని సుధాకర్రావు, రాజవర్ధన్రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్ష,కార్యదర్శులు,నాగర్ కర్నూల్ ఇన్చార్జీ దిలీపా చారి పాల్గొన్నారు.