
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మే 25 ఆదివారం జరగనుంది. పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. పేపర్ 1 (జనరల్ స్టడీస్): ఉదయం 9.30 నుండి 11.30 వరకు మరియు పేపర్ 2 (CSAT) - మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీస్ బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ప్రయాణానికి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ALSO READ | "రైతుకు ఒకలా, మధ్యతరగతికి మరోలా".. వేతనజీవుల వెతలు.. ఇది పచ్చి నిజం!
ఎగ్జామ్ సెంటర్స్ కు వెళ్లే వారిని బస్ రూట్లకు సంబంధించి రేతిఫైల్.. కోటి బస్ స్టాప్లో హెల్ప్లైన్ నంబర్స్ ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎగ్జామ్ సెంటర్లకు బస్ సర్వీసులునడుపుతామని టీజీఎస్ ఆర్టీసీ అధికారులుతెలిపారు. పరీక్షకు హాజరు కావడానికి, అభ్యర్థులు తమ ఇ- అడ్మిట్ కార్డు , ఫోటో ఐడి కార్డును తీసుకెళ్లాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుపై ముద్రించిన సూచనలను చదవాలని యూపీఎస్సీ తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు .. వారి ఇ- అడ్మిట్ కార్డులను upsconline.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.