
నటి ఊర్వశి రౌటేలా కరోనాపై పోరుకు తనవంతు సాయంగా రూ. 5 కోట్లు ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఊర్వశికి 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫాలోవర్స్ సహకారంతో ఈమె ఓ డ్యాన్ క్లాస్ ని నిర్వహించింది. దీంతో ఆమెకు వారి నుంచి భారీగా డొనేషన్స్ అందాయి. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ లో 1.8 కోట్ల మంది డ్యాన్స్ క్లాస్ లో పాల్గొన్నారు. వారి సహకారంతో రూ. 5 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపింది. ఈ సొమ్మును కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం విరాళంగా అందించింది. ఈ సాయం చిన్నదే కావచ్చు కానీ.. మా వంతు ప్రయత్నం వృథా కాలేదని.. కరోనాపై పోరాటానికి అందరి హెల్ప్ అవసరమని తెలిపింది ఊర్వశి. విపత్కర పరిస్తితుల్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.