భార్య, కొడుకును చంపి టెకీ ఆత్మహత్య!

భార్య, కొడుకును చంపి టెకీ ఆత్మహత్య!

న్యూయార్క్: అమెరికాలోని మేరీల్యాండ్​లో విషాదం జరిగింది. మన దేశానికి చెందిన భార్యభర్తలు, వారి ఆరేండ్ల కొడుకు తుపాకీ గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మేరీల్యాండ్‌‌‌‌‌‌‌‌ స్టేట్​లోని బాల్టిమోర్ కౌంటీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన భార్యభర్తలు యోగేష్ హెచ్ నాగరాజప్ప (37),  ప్రతిభా వై. అమర్‌‌‌‌‌‌‌‌నాథ్ (37) బాల్టిమోర్ కౌంటీలో నివసిస్తున్నారు. వారికి ఆరేండ్ల కుమారుడు యష్ హొన్నాల్ (6) ఉన్నాడు. దంపతులిద్దరూ సాఫ్ట్​వేర్​ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. 

కాగా, శుక్రవారం మధ్యాహ్నం వారి ఇంట్లో నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో వారి ఇంటిపక్కవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్​కు చేరుకొని పరిశీలించి.. వారు ముగ్గురూ తుపాకీ గాయాలతో చనిపోయినట్టు నిర్ధారించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, నాగరాజప్ప తన భార్య, కొడుకును చంపి ఆ తర్వాత తానూ సూసైడ్​ చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు.