‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాస్ బస్టర్ తర్వాత పదకొండేళ్ల గ్యాప్తో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. శనివారంతో మాసివ్ యాక్షన్ షెడ్యూల్ను కంప్లీట్ చేసినట్టు తెలియజేశారు మేకర్స్. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన స్పెషల్ సెట్లో యాక్షన్ సీన్స్ను షూట్ చేశారు.
మాస్ని మెప్పించే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్గా దీన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. త్వరలో మరిన్ని కొత్త అప్డేట్స్తో వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ లుక్స్తో పాటు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.