UP : ప్రేమించేముందు వీడు మంచివాడా కాదా..అని రకరకాల డౌట్స్ అమ్మాయిలకు ఉంటాయి. క్యారెక్టర్ తెలియడానికి కొన్ని రోజులు దాకా అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. అలాంటిది. ఓ అమ్మాయి..అందులోనూ ఆమె కానిస్టేబుల్ అయి ఉండి ఓ రౌడీని ప్రేమించింది. ప్రేమ కాస్త ముదరడంతో ఆ రౌడీఫెలోనూ పెళ్లి చేసుకుని పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు యువతి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరగగా వీరిద్దరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన రాహుల్ థార్సనా(30) 2014లో మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని హత్య చేశాడు. ఈ కేసులో అదే ఏడాది మే 9వ తేదీన అరెస్టు అయ్యాడు. అప్పటికే రాహుల్పై డజన్ కు పైగా హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. అయితే రాహుల్ ను కోర్టులో హాజరు పరిచేందుకు సూర్జాపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పాయల్.. రాహుల్ ను చూసి మనసు పారేసుకుంది. అతడు కూడా ఓకే అనడంతో వీరిద్దరు జైల్లో ప్రేమించుకున్నారు.
రాహుల్ బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా అతనితో తన ప్రేమయాణాన్ని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాల ప్రేమ కథకు తెరపడింది. పాయల్ ను పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రాహుల్. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. రాహుల్, పాయల్ ఓ మండపంలో సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు అయింది.. ఎక్కడ అయింది అనేది మాత్రం తెలియదు. పాయల్ పెళ్లికి ముందు గౌతమ్ బుద్ధనగర్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. పాయల్ గ్యాంగ్ స్టర్ ను పెళ్లి చేసుకున్నట్లు రుజువైతే తప్పకుండా ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.