రైతుల పక్షాన వంశీ కొట్లాడ్తరు : ఎమ్మెల్యే విజయ రమణారావు

 రైతుల పక్షాన వంశీ కొట్లాడ్తరు : ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి: పత్తిపాక రిజర్వాయర్​ను నిర్మించి  ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తరువాతే ఓట్లు అడుగుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.  పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే విజయ రమణారావు  మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగావంశీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు.  రైతుల పక్షాన లోక్​సభలో వంశీ మాట్లడుతారన్నారు.

 ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ ఎంపీ క్యాండిడేట్​ కొప్పుల ఈశ్వర్​పై  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్​ ఇక్కడి నీళ్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటే ఏం చేశావని ప్రశ్నిస్తూ ఈశ్వర్​.. నీకు సోయిందా అంటూ ప్రశ్నించారు. కొత్త బిచ్చగాళ్లకు పొద్దు ఎరుగదు అన్నట్లుగా బీఆర్​ఎస్​ నాయకులు చేన్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  రైతుల పేర్లు చెప్పి ఓటు అడిగే హక్కు బీఆర్​ఎస్​కు లేదన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయార్నారు. కటింగ్ లేకుండా ధాన్యం కొంటామన్నారు.  మానేరు నుంచి ఇసుక తీసేది లేదన్నారు.