హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పికిల్బాల్ అసోసియేషన్ (టీపీఏ) నిర్వహించిన మొదటి స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో వేదాన్ష్, విశ్వ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన అండర్12 బాయ్స్ ఫైనల్లో వేదాన్ష్ 15–-11తో రిషాన్ పై నెగ్గాడు. అండర్14 ఫైనల్లో విశ్వ 15–3తో ధనవంత్ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదిరాజ్ 15--–13తో రామచంద్ర కిరణ్పై , విమెన్స్ సింగిల్స్ తుదిపోరులో ప్రీతి రెడ్డి 11--–5తో వాసవి రెడ్డిపై గెలిచి టైటిళ్లు గెలుచుకున్నారు.
ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులందరూ బెంగళూరులో జరగబోయే నేషనల్ లెవెల్ చాంపియన్షిప్లకు అర్హత సాధించారని టీపీఏ సెక్రటరీ, టెన్నిస్ ఒలింపియన్ విష్ణువర్ధన్ తెలిపాడు. విన్నర్లకు మెడల్స్ అందజేశాడు.
