బిట్​ బ్యాంక్​ : భారతదేశ జనాభా

బిట్​ బ్యాంక్​ :  భారతదేశ జనాభా
  •     2011లో అత్యధిక జనాభా కలిగి ఉన్న తొలి మూడు రాష్ట్రాలు వరుసగా ఉత్తర్​ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్​. 
  •     2011లో లింగనిష్పత్తి అధికంగా గల రాష్ట్రాలు వరుస కమ్రంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్.
  •     2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్​ రాష్ట్రం గత దశాబ్దంలో మొత్తం అక్షరాస్యత విషయంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. అయితే, రాజస్థాన్​లో స్త్రీ,     పురుష అక్షరాస్యత మధ్య ఎక్కువ అంతరం ఉంది. 
  •     2011లో సేకరించిన జనాభా లెక్కలు 1872 నుంచి మొదలుకొని 15 సార్లు జరిగాయి. 
  •     2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం పురుష జనాభా 62.32కోట్లు. 
  •     2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం స్త్రీ జనాభా 58.75 కోట్లు. 
  •     2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనసాంద్రత 382.
  •     2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి 943.
  •     2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత పరంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా బిహార్​, పశ్చిమబెంగాల్​, కేరళ, ఉత్తరప్రదేశ్.
  •      0–6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల్లో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు వరుసగా మిజోరాం, మేఘాలయ, ఛత్తీస్​గఢ్​,         ఆంధ్రప్రదేశ్​.
  •     2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధిరేటు అధికంగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు వరుసగా మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్, బిహార్​, జమ్ముకశ్మీర్​. 
  •     2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ, పట్టణ జనాభా శాతాలు వరుసగా 68.8శాతం, 31.2శాతం. 
  •     భారతదేశంలో అత్యధిక, అత్యల్ప గ్రామీణ జనాభా కలిగి రాష్ట్రాలు మహారాష్ట్ర, సిక్కిం. 
  •     దేశంలో ఎస్సీ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలు వరుసగా పంజాబ్​, చండీఘర్​.
  •     ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం వరుసగా మిజోరాం, లక్షదీవులు. 
  •     మహిళల్లో అత్యధిక, అత్యల్ప డబ్ల్యూఎఫ్​పీఆర్​ గల రాష్ట్రాలు వరుసగా హిమాచల్​ప్రదేశ్, పంజాబ్​. 
  •     2011 జనాభా లెక్కల ప్రకారం వార్షిక జనాభా పెరుగుదల రేటు 1.84శాతం నమోదైంది. 
  •     భారతదేశంలో శ్రామికులుగా 15 నుంచి 60 సంవత్సరాల మధ్యగల వయస్సు వారిని పరిగణిస్తారు. 
  •     2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 45.6శాతం శ్రామికులు ప్రాథమిక రంగంపై ఆధారపడుతున్నారు. 
  •     జనాభాలో సంపూర్ణ ఫలనత్వరేటు భావన అంటే ఒక స్త్రీ జీవితకాలంలో ఆమెకు పుట్టిన పిల్లల సగటు సంఖ్య. 
  •     భౌతిక జీవన ప్రమాణ సూచీ లెక్కించడానికి కీలకమైన అంశాలు ప్రజల ఆయుర్ధాయం, శిశుమరణాల రేటు, అక్షరాస్యత. 
  •     డమోగ్రఫిక్​ డివిడెండ్​ అంటే 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్యగల ఉత్పాదక జనాభా పెరిగి దేశ వృద్ధిరేటులో పెరుగుదల. 
  •     జాతీయ నమూనా సర్వే ఆధారంగా 2011–12 సంవత్సరానికి ఇచ్చిన గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.4శాతంగా ఉంది.
  •     2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 350.6 మిలియన్ల పురుష శ్రామికులు ఉన్నారు. 
  •     డెమోగ్రాఫిక్​ డివిడెండ్​ మొత్తం జనాభాలో ఉత్పత్తిలో భాగస్వాములయ్యే వారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. 
  •     భారత డెమోగ్రాఫిక్​ డివిడెండ్​ ఫలాలను అందుకోవడానికి వీలుగా సమగ్ర సమీకృత జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్​ను ఏర్పాటు 12వ ప్రణాళికలో                        సానుకూలత వ్యక్తం చేశారు. 
  •     జనాభా పరివర్తన సిద్ధాంతం ప్రకారం మన దేశం రెండో దశలో ఉంది. 
  •     1911–21 దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా ఉంది. తర్వాత కాలంలో పెరగడం ప్రారంభించింది. అందువల్ల 1921 సంవత్సరాన్ని గొప్ప      విభాజక సంవత్సరంగా పరిగణిస్తారు. 
  •     11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేసింది.