హైదరాబాద్, వెలుగు: దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుండై ఇటీవల విడుదల చేసిన ఎస్యూవీ ‘వెన్యూ’కు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రెండు నెలల క్రితం దీనిని మార్కెట్లోకి విడుదల చేయగా ఇప్పటి వరకు 50 వేల బుకింగ్స్ సాధించామని హ్యుండై ప్రకటించింది. అత్యాధునిక టెక్నాలజీ, తగినంత జాగా, సౌకర్యం, భద్రత, ఆకర్షణీయత కలిగిన ఎస్యూవీని కోరుకునే నవతరం కస్టమర్ల కోసం వెన్యూను తయారు చేశామని హ్యుండై మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ చెప్పారు. ఎస్యూవీ మార్కెట్లో తమకు 21 శాతం వాటా ఉందని చెప్పారు. ఈ వాహనంలోని బ్లూలింక్ టెక్నాలజీ కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తోందని అన్నారు. హ్యుండై ఇండియా మార్కెట్లోకి గత నెల 21న ‘వెన్యూ’ను విడుదల చేసింది. దీనిని పూర్తిగా ఇండియాలోనే తయారు చేశారు. ఒక లీటర్ టర్బో, 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ ఎక్స్షోరూం ధరలు రూ.6.5 లక్షల నుంచి రూ.11.1 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారును అభివృద్ధి చేయడానికి రూ.690 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ తెలిపింది. వెన్యూలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, ఏర్ ప్యూరిఫయర్, క్రూజ్ కంట్రోల్, 33 కనెక్టెడ్ ఫీచర్స్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
వెన్యూకు రెండు నెలల్లో 50 వేల బుకింగ్స్
- బిజినెస్
- July 31, 2019
లేటెస్ట్
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!