మనిషి జీవితం నిరంతర పోరాటం.. బతకడం కోసం ప్రతి రోజూ యుద్ధం చేయాల్సిందే. వృద్ధాప్యంలో కూడా కొందరు బతుకుబండిని ముందుకు నడిపేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఇక్కడ ఈ 60 ఏళ్ల బామ్మ కూడా అంతే. ఆమె ఎవరో ఏమో తెలియదు కానీ ముంబై లోకల్ ట్రైన్లో చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతుంది. ఈ వీడియోను స్వాతి మలివాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియోకు ఇప్పటి వరకు 72 వేలకు పైగా వ్యూస్ రాగా, 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 8 వందలకు పైగా రీట్వీట్లు చేశారు. వృద్ధాప్యంలో ఇతరుల నుండి సహాయం కోసం అడిగే అవకాశం ఉన్నప్పటికీ, స్వతంత్రంగా డబ్బు సంపాదించడానికి ఆమె కష్టపడుతున్న తీరు నెటిజన్లను కట్టిపడేసింది. ఈ వృద్ధురాలికి సెల్యూట్.. పనికి భయపడి సాకులు చెప్పే యువతకు ఈమె స్ఫూర్తినిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ బామ్మ ఎక్కడుటుందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
किसी की ज़िंदगी आराम है, संघर्ष किसी की ज़िंदगी का नाम है। ये महिला और इनके जैसे हज़ारों लोग जो मेहनत कर दो वक्त की रोटी कमाते हैं, हो सके तो उनसे सामान ज़रूर खरीदें। pic.twitter.com/zKXU3oIE8w
— Swati Maliwal (@SwatiJaiHind) September 5, 2022