రామమందిరం వేడుకకు కోహ్లీ, అనుష్క శర్మలకు ఆహ్వానం

రామమందిరం వేడుకకు కోహ్లీ, అనుష్క శర్మలకు ఆహ్వానం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు అధికారిక ఆహ్వానాన్ని అందుకున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22 న ఈ వేడుక జరగనుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇన్విటేషన్ కార్డ్ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. MS ధోనీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్‌లకు ఇప్పటికే ఆహ్వానం అందగా.. తాజాగా కోహ్లీ ఈ లిస్టులో చేరిపోయాడు. 
   
వీవీఐపీ జాబితాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా దిగ్గజం బాబా రామ్‌దేవ్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీరితో పాటు రణదీప్ హుడా, టైగర్ ష్రాఫ్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, హేమ మాలిని, మనోజ్ రిషి వంటి ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.

కోహ్లీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్ కు అందుబాటులో లేని కోహ్లీ రెండో మ్యాచ్ లో 29 పరుగుల చేసి టచ్ లోకి వచ్చాడు. ఈ సిరీస్ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. అంతకముందు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో 172 పరుగుల చేసి భారత జట్టు తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు.