సియాటిల్(అమెరికా):బుల్లెట్ ట్రైన్లకంటే వేగంగా దూసుకెళ్లే హైపర్లూప్ వెహికల్ తొలి హ్యూమన్ ట్రయల్ను ఆదివారం సక్సెస్ఫుల్గా పూర్తి చేశామని వర్జిన్ గ్రూప్ అధికారులు ప్రకటించారు. రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గ్రూప్ తయారు చేసిన ఈ వెహికల్లో ఫస్ట్ కంపెనీ ఉద్యోగులే ప్రయాణించారు. ఈ ప్రయత్నం మనుషులు, వస్తువుల రవాణాలో ముందడుగు అని వర్జిన్ పేర్కొంది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తోపాటు మరికొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ హైపర్లూప్ ట్రయల్లో పాల్గొన్నారు. నెవడా సిటీ లాస్వేగస్ లోని లూప్టెస్ట్ సైట్లో ఈ ట్రయల్ జరిగింది. హైపర్లూప్చరిత్ర సృష్టించడం ఖాయమని ఈ సందర్భంగా వర్జిన్ హైపర్లూప్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులయెమ్ కామెంట్ చేశారు. హైపర్లూప్ కోసం నిర్మించే గొట్టపు ఆకారపు ట్రాక్లోని వాక్యూమ్ ట్యూబ్ల ద్వారా మనుషులను, వస్తువులను రవాణా చేస్తారు. ఈ వెహికల్స్ గంటకు 966 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తాయి. ప్రస్తుతం కంపెనీ చేపట్టిన ట్రయల్లో 172 కిలోమీటర్ల స్పీడ్ను మాత్రమే సాధించగలిగారు. నెవడా టెస్ట్ సైట్లో మనుషులు లేకుండా ఇది వరకు 400 సార్లు టెస్టులు నిర్వహించామని వర్జిన్ వెల్లడించింది. 2025 కల్లా అన్ని సర్టిఫికేషన్లు సంపాదించి, 2030 నుంచి కమర్షియల్ సర్వీసులు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని ప్రకటించింది.