రిక్రూటర్లను ఆకట్టుకుంటున్న వీఐటీ ఏపీ.. ఈ ఏడాది 1,560 ఆఫర్లు

రిక్రూటర్లను ఆకట్టుకుంటున్న వీఐటీ  ఏపీ.. ఈ ఏడాది 1,560 ఆఫర్లు
  • అత్యధిక జీతం రూ. 34.40 లక్షలు

హైదరాబాద్​, వెలుగు : టాలెంటెడ్​ స్టూడెంట్స్​ ఎక్కువగా ఉండటంతో క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​లో వీఐటీ–ఏపీ యూనివర్శిటీ ముందంజలో ఉందని ఛాన్స్​లర్​ డా. జీ విశ్వనాథన్​ చెప్పారు. ఇక్కడున్న కెరీర్​ డెవలప్​మెంట్​ సెంటర్​ (సీడీసీ) చురుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలోని పెద్ద కంపెనీలను సైతం క్యాంపస్​ రిక్రూట్​మెంట్​కు వచ్చేలా కృషి చేస్తోందని చెప్పారు. క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​ సజావుగా జరిగేలా సీడీసీ చొరవ తీసుకుంటోందని ప్లేస్​మెంట్​ సెలబ్రేషన్స్​లో  అన్నారు.

రూరల్ స్టూడెంట్స్​ కోసం సపోర్టెడ్​ అడ్వాన్స్​మెంట్​ ఆఫ్​ రూరల్​ స్టూడెంట్స్​(స్టార్స్​) పేరుతో ఒక ప్రోగ్రామ్​ను వీఐటీ అమలు చేస్తున్నట్లు విశ్వనాథన్​ వెల్లడించారు. 2023 గ్రాడ్యుయేటింగ్​ బ్యాచ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్ అద్భుతంగా సాగిందని, 1,021 మంది స్టూడెంట్లు ఉద్యోగాలు సంపాదించుకున్నారని వైస్​ చాన్సలర్​ డా. ఎస్​ వీ కోటా రెడ్డి చెప్పారు. తమ స్టూడెంట్లకు మొత్తం 1,560 జాబ్​ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నారు. వీఐటీ–ఏపీ క్యాంపస్​లోని ఒక స్టూడెంట్​కు ఒక ఎంఎన్​సీ నుంచి రూ. 34.4 లక్షల జీతంతో ఆఫర్​ రావడం విశేషమని వెల్లడించారు. 2023 బ్యాచ్​ యావరేజ్​ శాలరీ కూడా బాగా పెరిగి రూ. 7.20 లక్షలకు చేరిందన్నారు. ఈ ఏడాది మొత్తం 900 మంది రిక్రూటర్​లు క్యాంపస్​కు వచ్చినట్లు చెప్పారు.