కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విభజనతో ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పారు. చర్చ లేకుండానే విభజన బిల్లును ఆమోదించారని, రాజధాని లేకుండానే ఒక రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై YSRCP ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా YSRCP ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలన్నారు.
కేంద్రానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఉండవల్లి. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఏపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి అంత అలుసా? అని ప్రశ్నించారు. రోబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని అన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో కరెంట్ కోతలపై ఉండవల్లి స్పందిస్తూ… ఫిబ్రవరిలోనే విద్యుత్ కోతలు ఉంటే… వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదన్నారు.
మరిన్ని వార్తల కోసం..
