వాల్తేరు వీరయ్య నుంచి మరో లిరికల్ సాంగ్

వాల్తేరు వీరయ్య నుంచి మరో లిరికల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు కేక పుట్టించాయి. టైటిల్ సాంగ్ అభిమానులను అలరించింది. లేటెస్ట్ గా దర్శకుడు బాబీ మరో అప్ డేట్ ఇచ్చారు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ లిరికల్ సాంగ్ ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఓ వీడియోను పోస్టు చేశారు.

వీడియోలో సాంగ్ కు సంబంధించిన విషయాలపై  హీరో చిరంజీవి మాట్లాడారు. ‘వాల్తేరు వీరయ్యలోని రెండో సాంగ్ షూటింగ్ డిసెంబర్ 18వ తేదీన పూర్తయ్యింది. ఫ్రాన్స్ లోని TOULOUSE లో మైనస్ 0.. మైనస్ 1 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద షూటింగ్ చేశాం. డీఎస్పీ ఇచ్చిన బీట్స్, కొరియో గ్రాఫర్ శేఖర్ ఇచ్చిన స్టెప్స్ అన్నీ మైమరిచిపోయేలా చేశాయి.

థియేటర్ లో ఈ సాంగ్ చూసిన అనంతరం ప్రేకక్షులు సీట్లో కూర్చోరని అనుకుంటున్నా. డైరెక్టర్ బాబీ ఇచ్చిన కాన్సెప్ట్ తో సాంగ్ పూర్తి చేశాం. ఆరుద్ర విల్సన్ అందమైన లోకేషన్ ఎంపిక చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ కృషితో సాఫీగా సాగిపోయింది. ఈ సాంగ్ లో నచ్చింది ఒకటి. చెప్పొచ్చో .. చెప్పవచ్చో తెలియదు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ ఒకరినొకరు అనుకుంటూ సాంగ్ ఉంటుంది. అతి త్వరలో లిరికల్ సాంగ్ రాబోతోంది. 18వ తేదీతో షూటింగ్ పార్ట్ అయిపోవడం ఎంతో తృప్తిగా ఉంది’.  చిరంజీవి తెలిపారు. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.