ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్  సురభి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ చేసేలా చూడాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్  సురభి ఆదేశించారు. శుక్రవారం వనపర్తి మండలం చందాపూర్, చిట్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, విడతల వారీగా చెల్లింపులు చేస్తారని, ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

హౌజింగ్​ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని, పెండింగ్  సమస్యలు ఉంటే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జడ్పీ హైస్కూల్​ను సందర్శించి మ్యాథ్స్​లో వచ్చిన మార్కులు, ఎఫ్ఆర్ఎస్  అటెండెన్స్  గురించి ఆరా తీశారు. మ్యాథ్స్​లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. డీఈవో అబ్దుల్ ఘని, హౌజింగ్​ డీఈ విఠోబా, తహసీల్దార్  రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.

కొత్తకోట ఏపీవోకు షోకాజ్​ నోటీస్..

ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈ కేవైసీ నిర్వహించడంలో వెనుకబడిన కొత్తకోట ఏపీవోకు షోకాజ్  నోటీసులు జారీ చేయాలని కలెక్టర్  ఆదర్శ్​ సురభి ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ ఈకేవైసీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్​లో  డీఆర్డీవో ఉమాదేవితో కలిసి అన్ని మండలాల ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. వచ్చే సోమవారం నాటికి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పీఆర్​ ఈఈ మల్లయ్య, డీపీవో రఘునాథ్  పాల్గొన్నారు.