- కేటీఆర్ కు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు..
- కడెం ప్రాజెక్ట్ మరమ్మతు పనులకు భూమి పూజ
కడెం/ పెంబి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ రిపేర్పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదం వల్ల కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లోకి వెళ్లిందన్నారు. అప్పటి మంత్రి కేటీఆర్కు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియకపోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు రిపేర్ల కోసం రూ. 5 కోట్ల 46 లక్షలు మంజూరు చేశారని చెప్పారు.
రిపేర్ల కారణంగా ఈసారి క్రాప్ హాలీడేగా ప్రకటించామన్నారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణ పనులను సైతం త్వరలో చేపడతామన్నారు. కడెం ఎంపీపీ అలెగ్జాండర్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యనారాయణ , ఖానాపూర్ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, ఖానాపూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సంతోశ్ పాల్గొన్నారు.