అల్లర్ల బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం కేజ్రీవాల్

అల్లర్ల బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం కేజ్రీవాల్

ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు సీఎం అర్వింద్ కేజ్రీవాల్. పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. ఇండ్లు తగలపడిపోయాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలకు కేజ్రీవాల్ ట్విట్టర్ లో స్పందించారు. హింసాత్మక ఘటన బాధితులకు సహాయక చర్యలు అందేలా… తాము సాధ్యమైనంత వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇండ్లు కోల్పోయి రోడ్డుమీద పడినవారికి.. వారి పూర్వ జీవితాన్ని తిరిగి ఇచ్చే బాధ్యత  తీసుకుంటామన్నారు. అదే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి ఆహార, ఆర్థిక, వసతి సౌకర్యం అందేలా తాను దగ్గరుండి చూసుకుంటున్నానని చెప్పారు. తమ ఇళ్లలోకి, కాలనీల్లోకి తిరిగి వచ్చేవారిని.. ఇరుగు పొరుగువారు ప్రేమతో స్వాగతించాలని తాము కోరుకుంటున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు.

we-will-help-the-delhi-riot-victims-in-all-possible-ways-says-cm-kejriwal