
ఎన్నికలప్పుడే రాజకీయాలని.. తర్వాత అందరిని కలుపుకొని పోయి.. రాష్ట్ర అభివృద్దికి ... ప్రజాసంక్షేమానికి పాటుపడతామని పస్తాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం ఎన్నిసార్లైనా ప్రధాని మోదీని కలుస్తామని.. తెలంగాణకు అవసరమైన ఫండ్స్ తీసుకొస్తామంటూ.... . చెరువు మీద అలిగితే వాసన మనకే కదా అంటూ.. ఒకాయన ఫాంహౌస్ లో పడుకున్నారన్నారు. నేను మీ కోస్ పనిచేస్తా.. కష్టపడతానని సీఎం రేవంత్అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం ఉంటేనే అభివృద్ది జరుగుతుందన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించామని చెప్పారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఇంకా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రూ. 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుఉకు కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. మీరు అండగా ఉండండి... ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర, కొండా సురేఖ పాల్గొన్నారు.