ఇద్దరు స్మగ్లర్లను మట్టుబెట్టిన బీఎస్‌ఎఫ్

ఇద్దరు స్మగ్లర్లను మట్టుబెట్టిన బీఎస్‌ఎఫ్

కూచ్‌ బెహర్: భారత్, బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఇద్దరు స్మగ్లర్లను బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. వెస్ట్ బెంగాల్‌లోని కూచ్‌ బెహర్ సరిహద్దు ద్వారా ఇండియాలోకి చొరబడేందుకు ఆ స్మగ్లర్లు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వారిని ఆగాల్సిందిగా హెచ్చరించారు. కానీ మాటవినని స్మగ్లర్లు.. కర్రలు, కొడవళ్లతో జవాన్లపై దాడికి దిగారు. దీంతో సైనికులు స్వీయ రక్షణ కోసం స్మగ్లర్ల మీద ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడగా.. ఇద్దరు స్మగ్లరు చనిపోయారు. ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి స్మగ్లర్ల మృత దేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఫుల్‌‌ ఫ్యాన్స్‌‌ మధ్యలో ఫస్ట్‌‌ టీ20

ఫొటో ఫ్రేమ్​లలో డ్రగ్స్.. హైదరాబాద్‌ టూ ఆస్ట్రేలియా స్మగ్లింగ్!

మరో 4 వేల కోట్ల కొత్త అప్పుకు రెడీ అయిన సర్కారు