
తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర నేషనల్ జూ పార్క్లోని వైట్ టైగర్ ‘సమీర్’ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ, వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు వెల్లడించారు. వైట్ టైగర్ సమీర్ను 2011లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తిరుపతి జూ పార్క్కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే సంరక్షణలో ఉంది. సమీర్ మృతిపై జూ అధికారులు విచారం వ్యక్తం చేశారు.