రైలులో 13 గంటల పాటు భర్త శవం పక్కనే భార్య..

రైలులో 13 గంటల పాటు భర్త శవం పక్కనే భార్య..

పాపం ఆమెకు తెలియదు.. భర్త చనిపోయాడని.. రైలు ప్రయాణం కదా..అలసిపోయాడు ..నిద్రిస్తున్నాడులే అని అనుకుంది. అందరిలాగే హాషారుగా రైలు ఎక్కాడు .. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా ఉన్నాడు.. ప్రయాణం చాలా దూరం కాబట్టి విశ్రాంతి తీసుకునేందుకు నిద్రపోయాడు.. అయితే అతని ప్రాణం నిద్రలోనే పోయింది.. ఈ విషయం తెలియని భార్య, కుటుంబ సభ్యులు.. వారు దిగాల్సిన స్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో భార్య కు అనుమానం వచ్చిఅతడిని నిద్ర లేపింది. ఉలుకు లేదు పలుకు లేదు.. దీంతో షాక్ గురైన భార్య ఇతర కుటుంబ సభ్యులకు తెలిపింది.. వారు వచ్చి లేపినా ఆ వ్యక్తి లేవలేదు.. నిద్రలోనే చనిపోయాడని తెలుసుకొని బోరున విలపించారు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అయోధ్యకు వెళ్లేందుకు సూరత్ లో సబర్మతి రైలు ఎక్కింది ఓ ఫ్యామిలి. భర్త చనిపోయాడని తెలియకుండానే 13 గంటల పాటు మృతదేహంతో ప్రయాణం చేయాల్సిన విషాదకర ఘటన ఆ ఫ్యామిలీ ఎదుర్కొంది. అందరిలాగే హుషారుగా రైలు ఎక్కిన ఆ వ్యక్తి కొద్ది సేపటికే భార్యను పక్కన కూర్చొబెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు.. నిద్రలోనే చనిపోయాడు. ఈ విషయం తెలియని భార్య, కుటుంబ సభ్యులు 13 గంటల పాటు భర్త శవంతో ప్రయాణం చేశారు. అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత అతడిని నిద్రలేపిన భార్య, కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అతడు చనిపోయినట్లు తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఝాన్సీ జంక్షన్ లో దించారు. బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులు అతడిన మృతదేహాన్ని తీసుకెళ్లారు.