వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా

వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా

పంజాబ్​ ప్రజలకు తన అవసరం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని, అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి వెనుకాడబోనని కాంగ్రెస్​ సీనియర్​ నేత, పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ చెప్పారు. పదేండ్ల అకాలీదళ్​–బీజేపీ పాలనలో జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ఆ కష్టాలన్నింటినీ తీర్చేదాకా రెస్ట్​ తీసుకోలేనని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో ‘‘నాకిదే చివరి ఎన్నిక, ఇకపై పోటీ చేయను’’అని ప్రకటించిన కెప్టెన్​, ఇప్పుడిలా మాటమార్చడం చర్చనీయాంశమైంది. 2002లో ఫస్ట్​టైమ్​ సీఎంగా ఎన్నికైన ఆయన, 2017లోనూ కాంగ్రెస్​ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు.